IPL 2025: డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు!
- డోపింగ్లో దొరికిపోయిన కగిసో రబాడ
- తాత్కాలిక నిషేధం విధించిన క్రికెట్ దక్షిణాఫ్రికా
- త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడుతానంటున్న రబాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబాడ డోపింగ్లో దొరికిపోయాడు. డ్రగ్స్ (నిషేధిత ఉత్ప్రేరకం) వాడినందుకు గానూ క్రికెట్ దక్షిణాఫ్రికా అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని రబాడ స్వయంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాడు. వినోదం కోసం తీసుకున్న డ్రగ్స్ కారణంగా తాను నిషేధాన్ని ఎదుర్కొంటున్నా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్లో ఉన్నానని, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడుతానని రబాడ చెప్పాడు.
కగిసో రబాడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో రబాడ ఆడాడు. ఇక ఏప్రిల్ 3న స్వదేశానికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లాడని అప్పుడు గుజరాత్ యాజమాన్యం తెలిపింది. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు గుజరాత్ అతడిని కొనుగోలు చేసింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జీటీ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. మరో 10-12 రోజుల్లో రబాడ తిరిగి వస్తాడని తాము ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడు భారత్కు తిరిగొచ్చాడని తెలుస్తోంది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
గత జనవరి-ఫిబ్రవరిలో జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సందర్భంగా జరిపిన పరీక్షల్లో రబాడ డోపీగా తేలినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థ (వాడా) నియమావళి ప్రకారం.. కగిసో రబాడకు కనీసం మూడు నెలల నుంచి నాలుగేళ్ల వరకు శిక్ష విధించొచ్చు. అయితే తాను ప్రదర్శన కోసం డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం మూడు నెలల శిక్షతో బయటపడొచ్చు. దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక సంస్థ చికిత్సకు అంగీకరిస్తే.. శిక్ష రెండు నెలలకు కూడా కుదించొచ్చు. ఐసీసీ చర్యలు తీసుకుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రాబడ ఆడడం అనుమానమే.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..