IPL 2025 Auction: అతడికి ఆల్టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
- నవంబర్ 24-25 తేదీల్లో వేలం
- 574 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ
- పంత్కు ఆల్టైమ్ రికార్డు ధర పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. తాజాగా మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మెగా వేలంపై స్పందించాడు. రిషబ్ పంత్కు ఆల్టైమ్ రికార్డు ధర పక్కా అని జోస్యం చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్ మాత్రమే కాదు వికెట్ కీపర్ కూడా అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు కూడా వేలంలో భారీ డిమాండ్ ఉందని చెప్పాడు. కొన్ని జట్లు కెప్టెన్ కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని రైనా చెప్పుకొచ్చాడు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
Also Read: AUS vs IND: కమిన్స్కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!
టైమ్స్ ఆఫ్ ఇండియాతో సురేష్ రైనా మాట్లాడుతూ… ‘ఓసారి ఐపీఎల్ వేలంను చూస్తే.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ భారీ డబ్బు పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎందుకు పెద్ద మొత్తం తీసుకోకూడదు. రిషబ్ పంత్ కెప్టెన్, గన్ ప్లేయర్, గన్ వికెట్ కీపర్ కూడా. పంత్ ఎండార్స్మెంట్ చూస్తే.. అతని బ్రాండ్ విలువ ఏంటో అర్ధమవుతుంది. పంత్కు 25-30 కోట్లు పలుకుతాడు. అందుకు అతడు అర్హుడు. అతడికి ఆల్టైమ్ రికార్డు ధర పక్కా. టీమ్ ఏదైనా రిషబ్కు కప్ గెలవాలనే ఆటిట్యూడ్ ఉంది. ఢిల్లీ జట్టు కోసం ప్రయత్నించాడు. చాలా కష్టపడ్డాడు’ అని చెప్పాడు. బెంగళూరు, ఢిల్లీ, లక్నో, పంజాబ్ ఫ్రాంచైజీలు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!