IPL 2025 Auction: అతడికి ఆల్టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
- నవంబర్ 24-25 తేదీల్లో వేలం
- 574 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ
- పంత్కు ఆల్టైమ్ రికార్డు ధర పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. తాజాగా మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మెగా వేలంపై స్పందించాడు. రిషబ్ పంత్కు ఆల్టైమ్ రికార్డు ధర పక్కా అని జోస్యం చెప్పాడు. పంత్ గన్ ప్లేయర్ మాత్రమే కాదు వికెట్ కీపర్ కూడా అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు కూడా వేలంలో భారీ డిమాండ్ ఉందని చెప్పాడు. కొన్ని జట్లు కెప్టెన్ కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయని రైనా చెప్పుకొచ్చాడు.
Also Read
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
Also Read: AUS vs IND: కమిన్స్కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!
టైమ్స్ ఆఫ్ ఇండియాతో సురేష్ రైనా మాట్లాడుతూ… ‘ఓసారి ఐపీఎల్ వేలంను చూస్తే.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ భారీ డబ్బు పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎందుకు పెద్ద మొత్తం తీసుకోకూడదు. రిషబ్ పంత్ కెప్టెన్, గన్ ప్లేయర్, గన్ వికెట్ కీపర్ కూడా. పంత్ ఎండార్స్మెంట్ చూస్తే.. అతని బ్రాండ్ విలువ ఏంటో అర్ధమవుతుంది. పంత్కు 25-30 కోట్లు పలుకుతాడు. అందుకు అతడు అర్హుడు. అతడికి ఆల్టైమ్ రికార్డు ధర పక్కా. టీమ్ ఏదైనా రిషబ్కు కప్ గెలవాలనే ఆటిట్యూడ్ ఉంది. ఢిల్లీ జట్టు కోసం ప్రయత్నించాడు. చాలా కష్టపడ్డాడు’ అని చెప్పాడు. బెంగళూరు, ఢిల్లీ, లక్నో, పంజాబ్ ఫ్రాంచైజీలు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!