Sai Pallavi : సాయిపల్లవికి అన్యాయం.. అర్హత ఉన్నా అందని అందలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi : తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. దక్షిణాదిలో కార్తికేయ-2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1, ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ అవార్డుల్లో ఓ హీరోయిన్కి అన్యాయం చేశారంటూ అవార్డులు నిర్వహించిన వారిపై ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్ కి రెండు సార్లు అన్యాయం జరిగిందంటూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యమీనన్ కు ఇద్దరికీ అవార్డులు ఇచ్చి తమ హీరోయిన్ కు అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Read Also:Vinesh Phogat: స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్ రెజ్లర్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
Also Read
న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి 2022 నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ, లవ్ స్టోరీ ఆ సంవత్సరం నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్. కానీ ఆమె వెనుకబడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఆ సమయంలో సాయి పల్లవి అభిమానులు పూజా హెగ్డేపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు పూజా హెగ్డే డబ్బుతో అవార్డును కొనుగోలు చేశారని విమర్శించారు.
Read Also:Siddaramaiah: చిక్కుల్లో సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో జరగనున్న విచారణ
అయితే రీసెంట్ గా జరిగిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందంటూ నిత్యా మీనన్ కి అవార్డ్ ఇచ్చి ఆమె అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గార్గి సినిమాలో సాయి పల్లవి నటన కంటే నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్ ఏం బాగుందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గార్గి చిత్రంలో సాయి పల్లవి తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి పోరాడే పాఠశాల ఉపాధ్యాయురాలిగా నటించింది. ఆ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించడంతో ఆమె నటనకు అవార్డు వస్తుందని అంతా భావించారు. అయితే ఆమెకు బదులుగా నిత్యా మీనన్కి అవార్డు రావడంతో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!