Madhya Pradesh : బిచ్చగాడికి బిచ్చం వేయడం కూడా తప్పేనా.. రూ.10 వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో యాచకులకు భిక్ష ఇవ్వడంపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి లోకల్ ప్రభుత్వం భిక్ష ఇవ్వడం, తీసుకోవడం నిషేధించింది. దానిని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇండోర్ను దేశంలోనే మొట్టమొదటి ‘యాచక రహిత నగరం’గా మార్చడమే లక్ష్యంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, లాసుడియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఆలయం వెలుపల ఒక వ్యక్తి ఒక బిచ్చగాడికి రూ.10 ఇచ్చాడు. దీని తరువాత అధికార యంత్రాంగం యాచక నిర్మూలన బృందానికి ఫిర్యాదు నమోదు చేసి, డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక బిచ్చగాడికి డబ్బు ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం 15 రోజుల్లో ఇది రెండవ సంఘటన.
Read Also:Kishan Reddy: అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (BNS) సెక్షన్ 223 కింద ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు తెలిపారు. అంతకుముందు, జనవరి 23న, ఖాండ్వా రోడ్డులోని ఒక ఆలయం దగ్గర ఒక భిక్షగాడికి భిక్ష ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత ఆరు నెలల్లో నగరంలోని 600 మందికి పైగా యాచకులను పునరావాసం కోసం షెల్టర్ హోమ్లకు పంపినట్లు ఇండోర్ జిల్లా యంత్రాంగం తెలిపింది. వీరిలో దాదాపు 100 మంది పిల్లలను పిల్లల సంరక్షణ సంస్థలకు పంపారు. ఈ యాచకులలో చాలా మంది బెలూన్లు, ఇతర వస్తువులను అమ్మే నెపంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడుక్కుంటూ కనిపించారు.
Read Also:South Coastal Zone: ఏపీకి షాక్ ఇచ్చిన రైల్వేశాఖ.. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కొత్త మెలిక..!
ఇండోర్ పరిపాలన యాచించడం, భిక్ష ఇవ్వడం, యాచకుల నుండి వస్తువులు కొనడంపై చట్టపరమైన నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ దశలో భాగంగా యాచకులకు పునరావాసం కల్పించడానికి కూడా పరిపాలన కృషి చేసింది. భోపాల్లో కూడా యాచకులకు డబ్బు ఇవ్వడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రచారం కింద బిచ్చగాళ్లకు డబ్బు ఇచ్చే బదులు, అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిక్షాటన నిర్మూలన బృందం సమాచారం అందించిన వారికి రూ. 1000 బహుమతిని కూడా ప్రకటించింది. ఇండోర్ పరిపాలన లక్ష్యం భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి, దానిని యాచకులు లేని నగరంగా మార్చడం. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!