Republic Day Celebrations: భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…
- ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా
- భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకకు అధ్యక్షుడు ప్రబోవో
- పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకున్న సుబియాంటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఆయన భారత పర్యటన కూడా ప్రత్యేకంగా మారనున్నారు.
READ MORE: IIT Baba: ‘గతజన్మలో నేను కృష్ణుడిని..’ ఐఐటీ బాబా సంచలన వ్యాఖ్యలు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
భారతదేశం – ఇండోనేషియా మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా బలపడ్డాయి. జీ20, ఇండియా-ఆస్ట్రేలియా-ఇండోనేషియా గ్రూప్ ద్వారా రెండు దేశాల మధ్య సహకారం కూడా పెరిగింది. రాష్ట్రపతి హోదాలో ప్రబోవో సుబియాంటో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు.. 2011లో సుసిలో బాంబాంగ్ యుధోయినా, 2018లో జోకో విడోడో కూడా రిపబ్లిక్ డేకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుబియాంటో భారతదేశ పర్యటన చాలా ముఖ్యమైనది. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉండవచ్చు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ముందు సుబ్యాంతో, ప్రధాని మోడీ శనివారం నాడు భేటీ కానున్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరగనుంది. అనేక ఒప్పందాలపై సంతకాలు కూడా చేయవచ్చు.
READ MORE: Kejriwal: డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!