Himachal Pradesh polls: 34వ సారి ఓటు వేశాడు.. అతని వయసు తెలిస్తే షాకే..
Himachal Pradesh polls: ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా బద్ధకిస్తున్న అక్షరాస్యులున్నారు. అలాంటిది 106ఏళ్ల వయసులో కూడా ఓటేసి తనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తున్నారు శ్యామ్ శరణ్ నేగి. అతను హిమాచల్ ప్రదేశ్లోని కల్పాలో రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు. భారతదేశంలో 1951 సాధారణ ఎన్నికల్లో మొదటి ఓటు వేశాడు. హిమాచల్ ప్రదేశ్లో, స్వతంత్ర భారతదేశంలోని మొదటి ఓటరు. గిరిజన జిల్లా కిన్నౌర్కు చెందిన 106 ఏళ్ల మాస్టర్ శ్యామ్ శరణ్ నేగి 14వ విధానసభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ ప్రారంభమైందని AIR ప్రతినిధి తెలిపారు.
Read Also: K. A. Paul: నేను బిజీ నావద్దకు రావద్దు…సెల్ఫీలు దిగొద్దు ప్లీజ్
Also Read
- Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
శ్యాం శరణ్ నేగి లోక్సభ ఎన్నికలలో పదహారు సార్లు ఓటు వేశారు. అతను 2014 నుంచి రాష్ట్ర ఎన్నికల చిహ్నంగా కూడా ఉన్నాడు. శ్యామ్ శరణ్ నేగి తన జీవితంలో మొదటిసారి తన ఇంటి నుండి ఓటు వేశారు. శరణ్ నేగి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జిల్లా యంత్రాంగం కల్పాలోని ఆయన ఇంటి వద్ద రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసింది. అందుకే ఆయన ఓటును నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. తన తండ్రి 1951లో ఓటు వేసి మొదటి ఓటరు అయ్యారని శ్యామ్ శరణ్ నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తెలిపారు. ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారని తెలిపారు. ఈ వయస్సులో కూడా ఓటు వేయడం ద్వారా పౌరుడిగా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. నేగి హిమాచల్ ప్రదేశ్ కు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!