సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్ను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో.. అదే సమయంలో లడక్ ప్రాంతంలో మాత్రం చలి మంచు కమ్మేస్తోంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన ఐస్ కాఫీ కేఫ్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
Read Also: K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ భహిరంగ సభ విఫలమైంది..
అయితే, ఈ ఐస్ కాఫీ కేఫ్లో సాంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలను అందించనున్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. ఈ కృత్రిమ, సహజమైన హిమానీనదం మంచు గడ్డలతో తయారు చేశారు. ఈ మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.
🚨 India’s first ice cafe at 14000 feet in Ladakh. 🇮🇳 pic.twitter.com/AIALngPuEj
— Indian Tech & Infra (@IndianTechGuide) April 6, 2024