పారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ పతకాన్ని కోల్పోయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో రమితా జిందాల్ ఏడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల ఫైనల్లో 20 ఏళ్ల రమిత 145.3 స్కోర్ చేసింది. ఎలిమినేషన్లు ప్రారంభమైనప్పుడు ఆమె 10 షాట్ల తర్వాత ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత, ఆమె 10.5 షాట్తో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో.. నార్వేకు చెందిన హేగ్ లియానెట్ దస్తాద్ నిష్క్రమించింది. తదుపరి షాట్లో రమిత ఔట్ అయింది. ఆదివారం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది.
Read Also: Shivam Bhaje: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శివం భజే’ రిలీజ్ ఎప్పుడు అంటే..?
తరువాతి రెండు షాట్లలో కూడా రమిత వెనుకబడిపోయింది. రమిత 10.2 షాట్తో ప్రారంభించి ఐదవ స్థానానికి చేరుకుంది. ఎలిమినేషన్ కంటే 0.2 పాయింట్లు ముందుంది. ఆ తర్వాత ఆమె మళ్లీ 10.2 షాట్ ఆడింది. దీంతో.. రమిత ఆరో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత షూటాఫ్లో రమిత 10.5 స్కోర్ చేసింది. అయితే రమిత ప్రత్యర్థి ముల్లర్ 10.8 స్కోర్ చేయడం ద్వారా పోటీలో నిలబడ్డాడు. ఈ విధంగా రమిత ప్రయాణం ఏడో స్థానంతో ముగిసింది. ఇదిలా ఉంటే.. కొరియాకు చెందిన హ్యోజిన్ బాన్, షూట్ ఆఫ్లో చైనాకు చెందిన యుటింగ్ హువాంగ్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. స్విట్జర్లాండ్కు చెందిన ఆడ్రీ గోగ్నియట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా..రమితా జిందాల్ హాంగ్జౌ ఆసియా క్రీడల కాంస్య పతకం సాధించింది. దేశవాళీ ట్రయల్స్లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలు మెహులీ ఘోష్.. తిలోత్తమ సేన్లను ఓడించి పారిస్కు ఒలింపిక్స్కు వెళ్లింది.
Read Also: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!