Site icon NTV Telugu

Indian Student Killed in US: యూఎస్‌లో భారత విద్యార్థి హత్య.. సాయం మరిచి నిరాశ్రయుడి ఘాతుకం

United States

United States

Indian Student Killed in US: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్‌కు చెందిన విద్యార్థి యూఎస్‌లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత లేకుండా ఆ విద్యార్థిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న ఈ ఘటన జరిగింది.

Read Also: Ayodhya: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. షాకైన భక్తులు.. చివరికి ఏమైందంటే..!

జార్జియాలోని ఓ ఫుడ్​ మార్ట్‌లో పార్ట్​ టైమ్​ జాబ్​ చేస్తూ చదువుకుంటున్నాడు హర్యానాకు చెందిన వివేక్​ సైనీ. కాగా.. జులియన్​ ఫౌల్క్​నర్​ అనే నిరాశ్రయుడు.. కొన్ని రోజుల క్రితం ఆ ఫుడ్​ మార్ట్‌కు వెళ్లాడు. వివేక్‌తో పాటు మార్ట్​ సిబ్బంది అతనికి సాయం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆ నిరాశ్రయుడు అక్కడే ఉండిపోయాడు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న మంచి మనసుతో.. ఎవరు ఏం పట్టించుకోలేదు. అతను ఏం అడిగితే అది ఇచ్చారు. మంచి నీరు, చిప్స్​, కోక్​.. అన్ని ఇచ్చారు. బ్లాంకెట్​, జాకెట్​ కూడా ఇచ్చారు. సిగరెట్లు అడిగితే.. అవి కూడా ఇచ్చారు. పార్ట్​ టైమ్​ జాబ్​ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న వివేక్​ సైనీపై ఒక్కసారిగా దాడి చేశాడు జులియన్​ ఫౌల్క్​నర్​. సుత్తితో 50సార్లు అతని తలపై కొట్టాడు. వివేక్​ సైనీ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు.

Read Also: MP Bureaucrat Killed: నామినీగా చేయనందుకు.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్యను హత్య చేసిన భర్త

సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికే వివేక్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. అతడు మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. వివేక్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version