Indian Railways: రైల్వే టికెట్ రద్దు చేస్తున్నారా.. ఆ సమయంలోపు క్యాన్సల్ చేస్తే పైసా రాదు! కొత్త నిబంధనలు ఇవే..
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే రీఫండ్ విధానం
- బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వే తన ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్ల రద్దు నిబంధనలను సవరించి, సరికొత్త రీఫండ్ విధానాన్ని ప్రకటించింది. రైలు బయలుదేరడానికి మిగిలి ఉన్న సమయం ఆధారంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే, నిర్ణీత రద్దు రుసుము మినహాయించి గరిష్ట వాపసు పొందుతారు. అయితే, 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే కనీస రుసుముతో పాటు టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేయనుంది.
READ ALSO: Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
టికెట్ రద్దు చేసే సమయం దగ్గరపడే కొద్దీ జరిమానా భారం మరింత పెరుగుతుందని ఈ ప్రకటనలో అధికారులు వెల్లడించారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు టికెట్స్ క్యాన్సల్ చేస్తే, ప్రయాణ రుసుములో 50% కోత విధించబడుతుంది. మరీ ముఖ్యంగా, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే, ప్రయాణికులకు ఎటువంటి రీఫండ్ లభించదు. గతంలో రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు స్థిరమైన ఛార్జీలు (రూ.240 + GST లేదా రూ.180 + GST) ఉండగా, తాజా మార్పులతో సమయ పరిమితులు మరింత కఠినతరమయ్యాయి. మరోవైపు, ప్రయాణికులకు ఊరటనిచ్చేలా బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు వారు ఎక్కే స్టేషన్ను మార్చుకోవచ్చు. బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. దళారులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసి, ఆపై రద్దు చేయడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే టికెట్ నిర్ధారణ కోసం వచ్చే అభ్యర్థనలు గణనీయంగా తగ్గాయని, ఈ కొత్త నిబంధనలు వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తాయని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్కు సిద్ధమవండి!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!