Indian Railways: రైల్వే టికెట్ రద్దు చేస్తున్నారా.. ఆ సమయంలోపు క్యాన్సల్ చేస్తే పైసా రాదు! కొత్త నిబంధనలు ఇవే..
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే రీఫండ్ విధానం
- బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వే తన ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్ల రద్దు నిబంధనలను సవరించి, సరికొత్త రీఫండ్ విధానాన్ని ప్రకటించింది. రైలు బయలుదేరడానికి మిగిలి ఉన్న సమయం ఆధారంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే, నిర్ణీత రద్దు రుసుము మినహాయించి గరిష్ట వాపసు పొందుతారు. అయితే, 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే కనీస రుసుముతో పాటు టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేయనుంది.
READ ALSO: Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
టికెట్ రద్దు చేసే సమయం దగ్గరపడే కొద్దీ జరిమానా భారం మరింత పెరుగుతుందని ఈ ప్రకటనలో అధికారులు వెల్లడించారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు టికెట్స్ క్యాన్సల్ చేస్తే, ప్రయాణ రుసుములో 50% కోత విధించబడుతుంది. మరీ ముఖ్యంగా, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే, ప్రయాణికులకు ఎటువంటి రీఫండ్ లభించదు. గతంలో రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు స్థిరమైన ఛార్జీలు (రూ.240 + GST లేదా రూ.180 + GST) ఉండగా, తాజా మార్పులతో సమయ పరిమితులు మరింత కఠినతరమయ్యాయి. మరోవైపు, ప్రయాణికులకు ఊరటనిచ్చేలా బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు వారు ఎక్కే స్టేషన్ను మార్చుకోవచ్చు. బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. దళారులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసి, ఆపై రద్దు చేయడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే టికెట్ నిర్ధారణ కోసం వచ్చే అభ్యర్థనలు గణనీయంగా తగ్గాయని, ఈ కొత్త నిబంధనలు వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తాయని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్కు సిద్ధమవండి!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!