Indian Railways: రైల్వే టికెట్ రద్దు చేస్తున్నారా.. ఆ సమయంలోపు క్యాన్సల్ చేస్తే పైసా రాదు! కొత్త నిబంధనలు ఇవే..
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే రీఫండ్ విధానం
- బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వే తన ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్ల రద్దు నిబంధనలను సవరించి, సరికొత్త రీఫండ్ విధానాన్ని ప్రకటించింది. రైలు బయలుదేరడానికి మిగిలి ఉన్న సమయం ఆధారంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే, నిర్ణీత రద్దు రుసుము మినహాయించి గరిష్ట వాపసు పొందుతారు. అయితే, 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే కనీస రుసుముతో పాటు టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేయనుంది.
READ ALSO: Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!
Also Read
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
టికెట్ రద్దు చేసే సమయం దగ్గరపడే కొద్దీ జరిమానా భారం మరింత పెరుగుతుందని ఈ ప్రకటనలో అధికారులు వెల్లడించారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు టికెట్స్ క్యాన్సల్ చేస్తే, ప్రయాణ రుసుములో 50% కోత విధించబడుతుంది. మరీ ముఖ్యంగా, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే, ప్రయాణికులకు ఎటువంటి రీఫండ్ లభించదు. గతంలో రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు స్థిరమైన ఛార్జీలు (రూ.240 + GST లేదా రూ.180 + GST) ఉండగా, తాజా మార్పులతో సమయ పరిమితులు మరింత కఠినతరమయ్యాయి. మరోవైపు, ప్రయాణికులకు ఊరటనిచ్చేలా బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు వారు ఎక్కే స్టేషన్ను మార్చుకోవచ్చు. బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. దళారులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసి, ఆపై రద్దు చేయడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే టికెట్ నిర్ధారణ కోసం వచ్చే అభ్యర్థనలు గణనీయంగా తగ్గాయని, ఈ కొత్త నిబంధనలు వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తాయని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్కు సిద్ధమవండి!
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!