Iran Ship: ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయ మహిళ.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటికే గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్ కాలు దువ్వింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు తెగబడింది. ఇక ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు రెడీ అవుతోంది. ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్లోని 17 మంది భారతీయులలో కేరళకు చెందిన ఒక మహిళ స్వదేశానికి తిరిగి క్షేమంగా చేరుకుంది. త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఎంఈఏ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Priyadarshi: మరో హీరోయిన్ను డార్లింగన్న ప్రియదర్శి.. నీ మైండ్కేమైందంటూ ఆడుకున్న నభా!
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ భారత్కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. పర్షియన్ గల్ఫ్లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరైన కేరళ యువతిని ఇరాన్ విడిచిపెట్టింది. దీంతో ఆమె గురువారం క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చేసింది. నౌక స్వాధీనం వ్యవహారంపై ఇరాన్ ప్రభుత్వంతో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో సిబ్బందిలో ఒకరైన జోసెఫ్ను విడుదల చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిగతా 16 మందితో ఎంబసీ అధికారులు టచ్లోనే ఉన్నారని తెలిపారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. మిగతా సిబ్బంది విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nirbhay cruise missile: చైనా-పాకిస్తాన్కి వణుకే.. నిర్భయ్ క్షిపణి విజయవంతం..
Indian deck cadet Ms. Ann Tessa Joseph from Thrissur, Kerala, a member of the crew on vessel MSC Aries returned home today. @India_in_Iran, with the support of Iranian authorities, facilitated her return. Mission is in touch with Iranian side to ensure the well being of the… pic.twitter.com/iE932Y4F4y
— Randhir Jaiswal (@MEAIndia) April 18, 2024
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!