Iran Ship: ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయ మహిళ.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటికే గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్ కాలు దువ్వింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు తెగబడింది. ఇక ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు రెడీ అవుతోంది. ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్లోని 17 మంది భారతీయులలో కేరళకు చెందిన ఒక మహిళ స్వదేశానికి తిరిగి క్షేమంగా చేరుకుంది. త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఎంఈఏ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Priyadarshi: మరో హీరోయిన్ను డార్లింగన్న ప్రియదర్శి.. నీ మైండ్కేమైందంటూ ఆడుకున్న నభా!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ భారత్కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. పర్షియన్ గల్ఫ్లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరైన కేరళ యువతిని ఇరాన్ విడిచిపెట్టింది. దీంతో ఆమె గురువారం క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చేసింది. నౌక స్వాధీనం వ్యవహారంపై ఇరాన్ ప్రభుత్వంతో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో సిబ్బందిలో ఒకరైన జోసెఫ్ను విడుదల చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిగతా 16 మందితో ఎంబసీ అధికారులు టచ్లోనే ఉన్నారని తెలిపారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. మిగతా సిబ్బంది విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nirbhay cruise missile: చైనా-పాకిస్తాన్కి వణుకే.. నిర్భయ్ క్షిపణి విజయవంతం..
Indian deck cadet Ms. Ann Tessa Joseph from Thrissur, Kerala, a member of the crew on vessel MSC Aries returned home today. @India_in_Iran, with the support of Iranian authorities, facilitated her return. Mission is in touch with Iranian side to ensure the well being of the… pic.twitter.com/iE932Y4F4y
— Randhir Jaiswal (@MEAIndia) April 18, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!