Indian Army:భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్ మిలిటరీ పోస్ట్లు ధ్వంసం.. వీడియో వైరల్
- ఎల్ఓసీపై పాక్ మిలిటరీ పోస్ట్ను ధ్వంసం చేసిన దృశ్యం వీడియోగా విడుదల
- జమ్మూ-కశ్మీర్లో పాక్ సైన్యం సీస్ఫైర్ ఉల్లంఘనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంట డ్రోన్లు, మిసైళ్ల ద్వారా విస్తృతంగా దాడులు చేసేందుకు యత్నించింది. అయితే భారత భద్రతా బలగాలు సకాలంలో అప్రమత్తమై ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడులకు ప్రతిగా భారత సైన్యం ఎల్ఓసీ (Line of Control) వెంట పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై ధాటిగా ప్రతీకార దాడులు నిర్వహించింది.
Read Also: JD Vance : భారత్-పాక్ వివాదంలో జోక్యం చేసుకోం.. అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
తాజాగా, భారత వైమానిక దళాలు నిఘా కెమెరాల్లో రికార్డ్ చేసిన ఓ పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ ధ్వంసమైన దృశ్యాన్ని తొలిసారిగా అధికారికంగా విడుదల చేశాయి. ఇది భారత్ ఇచ్చిన ఘాటైన సమాధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత సైన్యం ప్రకటనలో పేర్కొనబడినదాని ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ సాయుధ బలగాలు డ్రోన్లు, ఇతర మునిషన్లతో వెస్ట్రన్ బోర్డర్ మొత్తం దాడులకు పాల్పడ్డాయి. అదేవిధంగా, జమ్ము కశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి అనేక సీస్ఫైర్ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. ఈ డ్రోన్ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని, పాక్ సీస్ ఫైర్ ఉల్లంఘనలకు.. సూటిగా, తగిన స్థాయిలో జవాబిచ్చామని భారత ఆర్మీ వెల్లడించింది. భారత దేశ స్వతంత్రతను, భూభాగ సమగ్రతను కాపాడటానికి భారత ఆర్మీ పటిష్టంగా ఉందని, పాకిస్తాన్ కుట్రలకు తగిన జవాబు ఇవ్వబడుతుందని ఆర్మీ స్పష్టం చేసింది.
OPERATION SINDOOR
Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/WTdg1ahIZp
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 9, 2025
ఇక, జమ్ము కశ్మీర్లోని సామ్బా జిల్లా సరిహద్దులో జరిగిన భారీ చొరబాటును భారత సరిహద్దు భద్రతా దళాలు (BSF) విజయవంతంగా నాశనం చేశాయి. ఈ ప్రయత్నంతో భారత్పై మరింత తీవ్ర దాడులు చేయాలన్న పాక్ పథకాలకు పెద్ద షాక్ తగిలింది. సరిహద్దులకు సమీపంగా ఉన్న నగరాల్లో బ్లాక్ఔట్ అమలులోకి వచ్చింది. శ్రీనగర్, జమ్ము, పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ వ్యవస్థ పనిచేయలేదు. ఇది అప్రమత్తత చర్యలలో భాగంగా తీసుకున్న భద్రతా చర్యగా చేపట్టారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!