IND vs ZIM: ఆటకు వేళాయే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
  • కాసేపట్లో హరారే వేదికగా జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్
  • ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్న ముగ్గురు భారత యువ ఆటగాళ్లు.
Ind Vs Zim

Ind Vs Zim

భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు యువ జట్టు సిద్ధమైంది. కాసేపట్లో హరారే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ టూర్‌లో యువ భారత్ బరిలోకి దిగుతుంది. టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం ఐపీఎల్‌కు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చారు. అభిషేక్ శర్మ, రియాగ్ పరాగ్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేస్తున్నారు.

Read Also: Game Changer: హమ్మయ్య రామ్ చరణ్ పని పూర్తయింది!

×
×
Ad

టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టు నుండి ఏ ఆటగాళ్లు మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడటం లేదు. కాగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి.. జట్టులో చోటు దక్కించుకునే అవకాశం వచ్చింది. కాగా.. జింబాబ్వే జట్టు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.
దీంతో జట్టు.. తీవ్ర నిరాశకు గురైంది. కాగా.. జింబాబ్వే ఆటగాళ్లు ఇప్పుడు తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.

Read Also: Jammu kashmir Encounter: సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. సైనికుడి మృతి