IND vs SL: శ్రీలంక 170 ఆలౌట్.. తొలి టీ-20లో భారత్ ఘన విజయం
- 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌట్
- తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL: కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 26 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్తో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. జవాబుగా, శ్రీలంక పూర్తి శక్తితో పోరాడింది. అయితే చివరి ఓవర్లలో దాని బ్యాట్స్మెన్ ఒత్తిడిని తట్టుకోలేక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(79), కుశాల్ మెండిస్(45) దూకుడుతో ఆ జట్టు ఓ దశలో విజయం వైపు దూసుకెళ్లింది. కానీ వీరిద్దరూ ఔటయ్యాక మిడిలార్డర్ కుప్పకూలడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించి.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీయగా.. అర్షదీప్, అక్షర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
- Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
- CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
తొలుత టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
-
India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!