Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.
Read Also:Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
2075లో టాప్-5 ఆర్థిక వ్యవస్థ దేశాలు
2075 సంవత్సరంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ దేశ విలువ 57 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 51.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అవుతుంది. దీని తరువాత యూరో ఏరియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇతర ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని గోల్డ్మన్ సాక్స్ రీసెర్చ్లో భారత ఆర్థికవేత్త శంతను సేన్గుప్తా అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నిపుణులు రాబోయే 20ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని అంటున్నారు. భారత్కు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడం ప్రత్యేకమని గోల్డ్మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!