Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి
- కేంద్రమంత్రికి తప్పిన ప్రమాదం
- ఇద్దరు అనుమానిత యువకులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీపై ఆకస్మికంగా రాళ్ల దాడి జరిగింది. అయితే అనూహ్యంగా కేంద్రమంత్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ రాయి మాత్రం ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి తగలడంతో గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఇద్దరు అనుమానాస్పద యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం బీహార్లోని గయా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ పాల్గొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వేదికపై నుంచి లేవగానే రాళ్ల దాడి జరిగింది. అయితే రాయి నేరుగా మంత్రికి తగలకపోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. అయితే ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి మాత్రం గాయాలయ్యాయి. ఖిజ్రసరాయ్ బ్లాక్లోని సిస్వార్ గ్రామంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read
- Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలంలోని పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఖిజ్రసరాయ్ పోలీస్ స్టేషన్ తక్షణమే చర్యలు చేపట్టి సంఘటనా స్థలం నుంచి ఇద్దరు అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుంది. రాళ్ల దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటి, ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేక ఆకస్మికంగా జరిగిందా అనే విషయాలను నిర్ధారించడానికి ప్రస్తుతం వారిద్దరినీ విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశంపై దర్యాప్తు జరుగుతోందని, ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
-
Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!