IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఈరోజు డర్బన్లోని కింగ్స్మీడ్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్యాచ్ లు సెయింట్ జార్జ్ పార్క్, న్యూ వాండరర్స్ స్టేడియాల్లో జరగనున్నాయి.
Read Also: Minister Jupalli: నియంత పాలన, డిక్టేటర్ పాలన పోయింది.. వంద శాతం న్యాయం చేస్తాం
ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గి మంచి జోరు మీదుంది. టీమిండియా 4-1తో ఆసీస్ ను ఓడించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లోనూ టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు. కాగా.. సౌతాఫ్రికా టూర్ లో శుభ్ మాన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్ల రాకతో టీమిండియా బలంగా ఉంది.
Read Also: YSR Law Nestham: రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్