India vs Pakistan: తాజా రిపోర్ట్స్తో కొత్త టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని పూర్తిగా చెప్పలేం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోతుంది. నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇండియా-పాక్ మ్యాచ్పై మొదటి నుంచే సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బహిష్కిరిస్తామని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అనేక సమావేశాల తర్వాత ఎట్టకేలకు ఆడతామని అంగీకరించింది. అయితే..
తాజాగా ఈ మ్యాచ్కు మరో టెన్షన్ మొదలైంది. అదే వర్షం.
READ MORE: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
శనివారం తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. మ్యాచ్ జరిగే అవకాశాలపై సందేహం కలుగుతోంది. పగలు సమయంలో 65 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చినుకులు మాత్రమే కాదు.. మెరుపులతో కూడిన వాన పడొచ్చని సమాచారం! రాత్రికి వర్షం అవకాశాలు 25 శాతానికి తగ్గుతాయని చెబుతున్నా.. సాయంత్రం 7 గంటల సమయంలో మళ్లీ 49 నుంచి 65 శాతం వర్షం పడే అవకాశం ఉండొచ్చని కొన్ని స్థానిక అంచనాలు సూచిస్తున్నాయి. గాలి ఉత్తర దిశ నుంచి గంటకు సుమారు 11 మైళ్ల వేగంతో వీయనుంది. వాతావరణం మొత్తం తేమగా ఉండే అవకాశముంది. ఈ వార్తల నేపథ్యంలో మ్యాచ్ పూర్తిగా రద్దవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఉత్పన్నమవుతోంది. టీ20 మ్యాచ్కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్లు అయినా ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే ఫలితం వెలువడదు. అలాంటి పరిస్థితిలో మ్యాచ్ను రద్దు చేసినట్టే అని చెబుతున్నారు. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. అంటే వర్షం వల్ల ఆట ఆగిపోయి 5 ఓవర్లు కూడా పూర్తి కాకపోతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. మ్యాచ్ను తిరిగి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు.
READ MORE: MS Dhoni: ఏంటి..! ధోనీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారా..? బయట పడిన సంచలన నిజం
ఇప్పటికే ఈ మ్యాచ్ జరగాలని ఐసీసీ చాలా కృషి చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొదట భారత్తో ఆడబోమని చెప్పినప్పుడు, ఐసీసీ అధికారులు లాహోర్కి వెళ్లి చర్చలు జరిపారు. చివరకు పాకిస్థాన్ ఒప్పుకుంది. కానీ ఇప్పుడు నిర్ణయం వాతావరణం చేతుల్లో ఉంది. మ్యాచ్ రద్దయితే ప్రసార హక్కులు పొందిన జియోస్టార్ సంస్థ ఎక్కువగా నష్టపోయేది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. ఆ భారీ వీక్షణల మీదే ప్రకటనల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మ్యాచ్ లేకపోతే ఆ ఆదాయం తగ్గిపోతుంది. టికెట్లు కొన్న అభిమానులకు సైతం ఇబ్బంది పడేవారు. మ్యాచ్ పూర్తిగా జరగకపోతే సాధారణంగా టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే శ్రీలంక క్రికెట్ బోర్డుకు గేటు రుసుముల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. రేపు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!