BoycottPakCricket: భారత్- పాకిస్థాన్ మ్యాచ్.. యువత రక్తం మరుగుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి చెందని 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల కుటుంబాల కళ్లు చెమ్మ ఆరలేదు. అంతలోనే శత్రువుతో మ్యాచ్ ఆడటం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం సహజం. గతంలో ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాన మంత్రి మోడీ చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ మాటలు ఏమయ్యాయని.. రక్తం, క్రికెట్ ఎలా కలిసి సాగగలవని ప్రభుత్వం, బీసీసీఐని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
READ MORE: Akhilesh Yadav: ” ఇదే కొనసాగితే, భారత్లో నేపాల్ లాంటి పరిస్థితి” అఖిలేష్ యాదవ్ వార్నింగ్..
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
అంతే కాదు.. తాజా పరిస్థితుల్లో సెప్టెంబర్ 14న దుబాయ్లో జరగబోయే భారత్ – పాక్ ఆసియా కప్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే, న్యాయమూర్తులు జే.కే. మహేశ్వరి, విజయ్ బిష్ణోయి ఉన్న ధర్మాసనం ఆ పిటిషన్ను విచారించేందుకు కూడా నిరాకరించింది. దీంతో చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కాన్పూర్, మొరాదాబాద్ వంటి నగరాల్లో బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పాకిస్థాన్ జెండాలను తగలబెట్టారు. #BoycottPakCricket, #PehalgamAttack వంటి హ్యాష్ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను అమరవీరులకు అవమానంగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సంజయ్ రౌత్ వంటి ప్రతిపక్ష నాయకులు సైతం ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!