India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు మరోసారి ఆఫ్ఘనిస్తాన్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్లు భారత్లో జరిగినప్పటికీ, ఈ సిరీస్కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేకపోతే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇది ఓ అరుదైన ఘట్టంగా నిలవనుంది. భారత గడ్డపై భారత్తో జరిగే మ్యాచ్లకు ప్రత్యర్థి జట్టు అధికారిక ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. భద్రతా పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్కు ప్రస్తుతం శాశ్వత అంతర్జాతీయ హోం గ్రౌండ్ లేకపోవడంతో, గత కొన్నేళ్లుగా భారత్లోనే తమ స్వదేశీ మ్యాచ్లను నిర్వహిస్తోంది.
ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్, లక్నో వంటి నగరాల్లో స్వదేశీ మ్యాచ్లు ఆడింది. అయితే ఇప్పటివరకు భారత్కు ఆతిథ్యం ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్లో జరిగే ఈ టీ20 సిరీస్ చారిత్రాత్మకంగా మారనుంది. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుండగా, రెండో టెస్టు ఆగస్టు 27న ముగియనుంది. ఆ తర్వాత దాదాపు రెండు వారాల విరామంతో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు ముందు ఈ సిరీస్ జరగడం వల్ల భారత జట్టుకు ఇది కీలక సన్నాహకంగా మారనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్టులో కూడా భారత్ ఒక ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈసారి టీ20 ఫార్మాట్లో బలంగా రాణించి గత ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. మరోవైపు, టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు వైట్బాల్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఓటమి, అనంతరం ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో కోల్పోవడం, అలాగే వన్డే సిరీస్ను 1-2తో చేజార్చుకోవడం జట్టుపై ఒత్తిడిని పెంచాయి.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది. ఆసియా క్రీడలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, సరైన జట్టు కూర్పును ఖరారు చేసుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ ఫార్మాట్లో ఆడుతున్న తొలి సిరీస్ కావడం కూడా దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!