IND vs BAN: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
- బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
- అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
- జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. టెస్టు సిరీస్ తర్వాత భారత్.. గ్వాలియర్, న్యూఢిల్లీ, హైదరాబాద్లలో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అతనికి విశ్రాంతి ఇచ్చారు. మళ్లీ ఈసారి ఇషాన్ కిషన్కు నిరాశే దక్కింది. మరోవైపు.. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లకు విశ్రాంతి ఇచ్చారు.
బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు సంజూ శాంసన్, జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడనున్నారు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత కూడా జట్టులో చోటు సంపాదించుకోగలిగాడు. కుల్దీప్ యాదవ్ను ఈ సిరీస్కు జట్టులో ఎంపిక చేయలేదు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మయాంక్ యాదవ్ తన వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మయాంక్ నాలుగు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా అతను దూరమయ్యాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీశాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024లో మయాంక్ గంటకు 155 కిమీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. మరోవైపు.. జింబాబ్వేతో టీ20 సిరీస్లో పాల్గొన్న అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. అలాగే.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
అక్టోబర్లో బంగ్లాదేశ్తో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను అక్టోబర్ 6 నుంచి గ్వాలియర్లో ఆడనుంది. రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్లో జరగనుంది.
Samsung Galaxy Tab S10: AI ఫీచర్లతో శాంసంగ్ కొత్త టాబ్లెట్లు విడుదల.. ఫీచర్లు ఇవే..!
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టు…
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
NEWS 🚨 – #TeamIndia’s squad for T20I series against Bangladesh announced.
More details here – https://t.co/7OJdTgkU5q #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/DOyz5XGMs5
— BCCI (@BCCI) September 28, 2024
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!