NTV Telugu Site icon

IND vs SL: భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్.. శ్రీలంక స్కోరు..?

Sl

Sl

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి శ్రీలంక 161 పరుగులు చేసింది. భారత్ ముందు 162 పరుగుల ఫైటింగ్ టార్గెట్ ను ముందుంచారు. శ్రీలంక బ్యాటింగ్లో ఓపెనర్లు పథుం నిస్సాంకా (32) మంచి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెననర్ కుశాల్ మెండీస్ (10) కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత వచ్చిన కుశాల్ పెరీరా(53) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

Read Also: Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిదంటే..?

కామింధు మెండీస్ (26) కూడా పర్వా లేదనిపించాడు. కెప్టెన్ చరిత్ అసలంక (14), దషున్ శనక, హసరంగా ఇద్దరు డకౌట్ తో వెనుదిరిగారు. రమేశ్ మెండీస్ (12), మహీష్ తీక్షణ (2) పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా తలో రెండేసి వికెట్లు తీశారు.

Read Also: Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..