Hybrid RPA Drones: భారత్ కొత్త నిఘా నేత్రం.. ఇక శత్రుదేశాలకు నిద్రపట్టదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hybrid RPA Drones: భారతదేశ రక్షణ వ్యవస్థలో కొత్త నిఘా నేత్రం జత కానుంది. ఇప్పటి వరకు అవలంభిస్తున్న సైనిక వ్యూహంలో భారత్ కొత్తగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ వ్యూహాలకు పదును పెడుతుంది. అందులో భాగంగానే సూపర్ డ్రోన్లను సైన్యంలో భాగం చేస్తుంది. ఈ కొత్త డ్రోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక శత్రుదేశాలకు నిద్రపట్టదు. ఈ ‘సూపర్ డ్రోన్’ సరిహద్దుల్లో 24 గంటల నిరంతర నిఘా, అధిక కచ్చితమైన లక్ష్యం, సంక్షోభ సమయంలో వేగంగా ప్రతిస్పందనను కలిగి ఉన్నాయి. వీటితో ఇప్పుడు సైనిక వ్యూహం సైనికులు, బంకర్లకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత ఆధారితంగా మారనుంది. 15 ఏళ్ల రక్షణ ఆధునీకరణ రోడ్మ్యాప్లో భాగంగా కేంద్ర సర్కార్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
READ ALSO: Telanagana : ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల బంద్, ఇబ్బందుల్లో విద్యార్థులు.
Also Read
- PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
20 వేల అడుగుల ఎత్తులో నిఘా..
వైమానిక దళం కోసం ఎంపిక చేయనున్న హైబ్రిడ్ RPA (రిమోట్-ఫైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్) ఫిక్స్డ్-వింగ్, రోటరీ-వింగ్ టెక్నాలజీల కలయికతో తయారు కానుంది. వీటితో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. ఇవి 20 వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. అలాగే వీటితో స్థిరమైన నిఘా, అవసరానికి అనుగుణంగా వెంటనే తక్కువ స్థాయికి కూడా దిగగలవు. ప్రస్తుతం వైమానిక దళానికి ప్రారంభంలో 10 – 20 హైబ్రిడ్ RPAలు అవసరమని అధికారులు చెబుతున్నారు. వీటిలో మీడియం రేంజ్ ఎత్తు, దీర్ఘ విమాన (MALE) డ్రోన్లు 30 – 40 వేల అడుగుల వరకు పనిచేయగలవు. అలాగే 24 గంటలకు పైగా గాలిలో ఉండటం ద్వారా నిరంతర కవరేజీని ఇవి అందిచనున్నాయి.
కొనుగోలు ఉద్దేశ్యం ఏమిటంటే..
ఈ కొనుగోలు ప్రక్రియ మేక్ – ఇన్ – ఇండియాలో భాగంగా చేపడుతున్నట్లు సమాచారం. అలాగే దేశంలోనే ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసేదిగా భావిస్తున్నారు. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల పాత్ర చాలా కీలకంగా మారింది. ఇవి శత్రువుల కదలికలపై నిరంతర నిఘాతో పాటు, లక్ష్యంగా చేసుకున్న దాడులను కచ్చితంగా చేస్తాయి. అలాగే తక్కువ ప్రమాదంలో భారీ నష్టాన్ని కలిగించడంలో విశేషంగా సహాయపడతాయి. పాకిస్థాన్ – చైనా వంటి సరిహద్దుల్లో ఈ డ్రోన్లు దేశ బలాన్ని పెంచుతాయని రక్షణ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Donald Trump: ఇజ్రాయెల్పై ట్రంప్ ఫైర్.. ఖతార్తో జాగ్రత్త అంటూ హెచ్చరిక
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!