NTV Telugu Site icon

India Squad: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన

India Squad

India Squad

India Squad: స్వల్ప విరామం తర్వాత టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు టీ-20 సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. వారు జనవరి 10న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.

శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 5.5 కోట్లకు కొనుగోలు చేసిన పేసర్ ముఖేష్ కుమార్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం గమనార్హం. కాగా, వన్డే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నారు. బంగ్లాదేశ్‌తో సాధారణ సిరీస్ తర్వాత, శిఖర్ ధావన్‌ను లంక జట్టుతో జరిగే సిరీస్ నుంచి తొలగించారు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజాకు మరోసారి జట్టులో చోటు దక్కలేదు.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఇవే..

భారత టీ-20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (wk), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (VC), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా (VC), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.