India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు
- ఆరు కీలక రంగాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రెండు దేశాలు గురువారం రెండు అవగాహన ఒప్పందాలు, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పరస్పరం మార్చుకున్నాయి. ముఖ్యంగా ఆహార భద్రత, సముద్ర వారసత్వం, టెలికమ్యూనికేషన్స్, ప్రసార నియంత్రణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. అలాగే అధునాతన తయారీ, డిజిటలైజేషన్ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
సింగపూర్లో ఆగస్టు 20న జరిగిన నాలుగో ఇండియా-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్టేబుల్ సమావేశంలో ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్-ఐటీ, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read
ఆరు కీలక రంగాలపై చర్చ
నాలుగో ISMRలో ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఆరు ప్రధాన రంగాలపై చర్చించారు. అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్యం-వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి అంశాల్లో ఇప్పటికే జరుగుతున్న సహకారాన్ని సమీక్షించడంతో పాటు కొత్త అవకాశాలను అన్వేషించారు.
భారత్-సింగపూర్ భాగస్వామ్యంలో మంచి ఊపు కొనసాగుతోందని, దీనిని మరింత స్పష్టమైన ఫలితాలుగా మార్చేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు సాగినట్లు పేర్కొంది.
మూడు ఒప్పందాలు.. ఏ రంగాల్లో అంటే?
నాలుగో ISMR సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య రెండు MoUs, ఒక LoIను పరస్పరం మార్చుకున్నారు. వీటిలో సముద్ర వారసత్వం (Maritime Heritage) రంగంలో సహకారం,
ఆహార భద్రత (Food Safety) రంగంలో సహకారం, టెలికమ్యూనికేషన్స్, ప్రసార నియంత్రణలు వంటి అంశాల్లో సహకారం ఉన్నాయి. ఈ ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో సహకారం మరింత విస్తరించనుంది.
ISMR సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సింగపూర్ రవాణా మంత్రి, రెండో ఆర్థిక మంత్రి జెఫ్రీ సియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థిక వ్యవహారాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. సింగపూర్ తరఫున ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల మంత్రి గాన్ కిమ్ యోంగ్ నేతృత్వం వహించారు. సీనియర్ మంత్రి, జాతీయ భద్రత సమన్వయ మంత్రి కె. షణ్ముగం, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, డిజిటల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి జోసెఫిన్ టియో, రవాణా మంత్రి, రెండో ఆర్థిక మంత్రి జెఫ్రీ సియో కూడా సమావేశంలో పాల్గొన్నారు.
భారత్-సింగపూర్ మధ్య ఇప్పటికే ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు.. అధునాతన తయారీ, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో భవిష్యత్ సహకారానికి ఈ సమావేశం కీలక వేదికగా నిలిచింది.
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?