Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Buying Trends: స్మార్ట్ఫోన్ అనగానే ముందుగా.. కెమెరా ఎన్ని పిక్సల్స్.. ఫొటో క్వాలటీ ఎలా ఉంటుంది.. బ్యాటరీ బ్యాకప్ పరిస్థితి ఏంటి అని చూస్తుంటారు.. కానీ, స్మార్ట్ఫోన్ కొనుగోలు నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కీలకంగా మారుతున్నాయి. అమెజాన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ఏకంగా 82 శాతం మంది స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులు AI ఫీచర్లను తమ కొనుగోలు నిర్ణయంలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు. 2026 జూలైలో నిర్వహించిన ఈ సర్వేలో స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, గృహోపకరణాల విభాగాలకు చెందిన 40,000 మందికిపైగా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు.
ఏఐలో ఈ ఫీచర్లకే ఎక్కువ డిమాండ్
వినియోగదారులను ఆకట్టుకుంటున్న AI ఫీచర్లలో కాంటెక్స్చువల్ అసిస్టెన్స్ ముందంజలో ఉంది. 25 శాతం మంది దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. వినియోగదారుడి అవసరాన్ని అర్థం చేసుకుని రియల్టైమ్లో సహాయం చేయడం దీని ప్రత్యేకత. ఆ తర్వాత జనరేటివ్ ఫొటో ఎడిటింగ్కు 18 శాతం, విజువల్ సెర్చ్కు 17 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. అడాప్టివ్ బ్యాటరీ మేనేజ్మెంట్ను 11 శాతం మంది ముఖ్యమైన ఫీచర్గా పేర్కొన్నారు.
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
పనితీరు, బ్యాటరీకి కూడా ప్రాధాన్యం
AIపై ఆసక్తి పెరిగినా.. స్మార్ట్ఫోన్ ప్రాథమిక అంశాల విషయంలో వినియోగదారులు రాజీపడటం లేదని సర్వే వెల్లడించింది. 87 శాతం మంది పనితీరు, వేగాన్ని అత్యంత ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు. 79 శాతం మంది బ్యాటరీ లైఫ్కు, 77 శాతం మంది కెమెరా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. తమ ప్రస్తుత ఫోన్లలో మెరుగైన బ్యాటరీ లైఫ్ కావాలని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.
రూ.25 వేల–రూ.50 వేల ఫోన్లకు డిమాండ్
ఇక, ధరల విషయానికొస్తే.. 42 శాతం మంది వినియోగదారులు రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు 48 శాతం మంది రాబోయే మూడు నెలల్లో తమ ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఫోన్ కొనుగోలులో రివ్యూలు, రేటింగ్లకు కూడా వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 47 శాతం మంది రివ్యూలు, రేటింగ్లను ముఖ్యంగా పరిగణిస్తుండగా, 35 శాతం మంది ధర, డీల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో AI ఇక అదనపు ఫీచర్గా కాకుండా కొనుగోలుదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారుతోంది. అయితే AIతో పాటు వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి ఫీచర్లకు కూడా వినియోగదారులు సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!