Hottest October: 120 ఏళ్ల తర్వాత.. అక్టోబర్లో అత్యధిక వేడి..!
- 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదు
- గతంలో 1901..1951 అక్టోబర్లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు
- ఈ సంవత్సరం అక్టోబర్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతకుముందు.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో 1901 అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది. ఆ తర్వాత.. నవంబర్లో కూడా వేడి నుండి ఉపశమనం లభించలేదు.
వాతావరణ శాఖ ప్రకారం.. నవంబర్ మొదటి రెండు వారాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. అయితే రెండో వారంలో ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇంత వేడికి గల కారణాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. నాలుగు అల్పపీడన వ్యవస్థలు, వేసవి రుతుపవనాల ఆలస్యం, అక్టోబర్లో పశ్చిమ భంగం వంటి కారణాల వల్ల వేడి ఏర్పడిందని అన్నారు. అలాగే.. నవంబర్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని.. దీంతో ఈశాన్య, తూర్పు మధ్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని రోజులు వేడిగా ఉంటాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. పశ్చిమ మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశాన్ని కలిపే ప్రాంతాల్లో.. పగటిపూట ఉష్ణోగ్రత సాధారణంగా లేదా సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని అన్నారు.
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Read Also: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఈ ఏడాది దేశంలో చలి వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదని వాతావరణ శాఖ తెలిపింది. లా నినా ఇంకా రూపుదిద్దుకోక పోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. లా నినా ఏర్పడిన తర్వాతే ఈ ఏడాది వచ్చే చలిపై సరైన అంచనా వేయవచ్చుని ఐఎండీ తెలిపింది. అన్ని ప్రధాన గ్లోబల్ మోడల్లు నవంబర్-డిసెంబర్లో లా నినా ఏర్పాటును సూచించాయని ఐఎండీ చీఫ్ చెప్పారు. అయితే ఇది జరగకపోతే మళ్లీ తాజా గ్లోబల్ మోడల్స్ కోసం వేచి ఉండాల్సి ఉంటుందని.. అప్పుడే దేశంలో ఈ ఏడాది చలి ఎంత, ఎంతకాలం ఉంటుందో చెప్పగలమని పేర్కొన్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో లా నినా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా జరిగితే.. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో తీవ్రమైన చలిని ఎదుర్కోవలసి ఉంటుంది. వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. లా నినా సాధారణంగా చలి కాలంలో ఉత్తర, వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతల తగ్గుదలతో ముడిపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం దీని గురించి ఏమీ ఊహించలేము. ఇంకా అనుకూల పరిస్థితులు ఉన్నా ఇంకా లా నినా ఎందుకు ఏర్పడలేదనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అన్ని గ్లోబల్ మోడల్లలో ఏమి తప్పు జరిగిందో చూడాలని తెలిపారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!