DGMO Meeting: భారత్, పాక్ మధ్య కీలక చర్చలు.. సాయంత్రానికి వాయిదా..!
- భారత్, పాక్ మధ్య కీలక చర్చలు..
- సాయంత్రం 5 గంటలకు వాయిదా .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వాతావరణం పెద్దెత్తున ఉద్రిక్తతకు లోనైంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీని కొనసాగింపుగా డీజీఎంవోలు ఈ రోజు (మే 12) మధ్యాహ్నం చర్చించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ కెప్టెన్!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అయితే, అనూహ్యంగా చర్చలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగనున్నాయి. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ తరఫున మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ చర్చల్లో ప్రధానంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దు ఉల్లంఘనలు, భద్రతా సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ఈ చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. చర్చలు వాయిదా పడినప్పటికీ, సాయంత్రం జరిగే సమావేశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
Delhi | Media briefing by Director General Military Operations of All Three Services – Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM
— ANI (@ANI) May 12, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!