DGMO Meeting: భారత్, పాక్ మధ్య కీలక చర్చలు.. సాయంత్రానికి వాయిదా..!
- భారత్, పాక్ మధ్య కీలక చర్చలు..
- సాయంత్రం 5 గంటలకు వాయిదా .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వాతావరణం పెద్దెత్తున ఉద్రిక్తతకు లోనైంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీని కొనసాగింపుగా డీజీఎంవోలు ఈ రోజు (మే 12) మధ్యాహ్నం చర్చించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ కెప్టెన్!
Also Read
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
అయితే, అనూహ్యంగా చర్చలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగనున్నాయి. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ తరఫున మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ చర్చల్లో ప్రధానంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దు ఉల్లంఘనలు, భద్రతా సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ఈ చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. చర్చలు వాయిదా పడినప్పటికీ, సాయంత్రం జరిగే సమావేశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
Delhi | Media briefing by Director General Military Operations of All Three Services – Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM
— ANI (@ANI) May 12, 2025
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!