DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వాతావరణం పెద్దెత్తున ఉద్రిక్తతకు లోనైంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీని కొనసాగింపుగా డీజీఎంవోలు ఈ రోజు (మే 12) మధ్యాహ్నం చర్చించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ కెప్టెన్!
అయితే, అనూహ్యంగా చర్చలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగనున్నాయి. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ తరఫున మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ చర్చల్లో ప్రధానంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దు ఉల్లంఘనలు, భద్రతా సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ఈ చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. చర్చలు వాయిదా పడినప్పటికీ, సాయంత్రం జరిగే సమావేశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
Delhi | Media briefing by Director General Military Operations of All Three Services – Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM
— ANI (@ANI) May 12, 2025