ఇండియా లో ఇవాళ కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,451 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 585 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,021 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,35,97,339 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,55,653 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,91,516 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 1,03,53,25,577 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఇండియా కొత్తగా 13, 451 కరోనా కేసులు
