Site icon NTV Telugu

LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..

Lpg

Lpg

LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు-గ్యాస్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జలమార్గం ద్వారా 20 శాతం ఇంధన రవాణా జరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. భారత్‌లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా వంట గ్యాస్‌పై ప్రజలు భయాందోళనలో ఉన్నాయి. మనం దిగుమతి చేసుకునే LPGలో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుండటంతో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మిత్రదేశం భారత్‌ కోసం సాయానికి ముందుకు వచ్చింది. భారత్ సుదూరంలో ఉన్న అర్జెంటీ నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతోంది. 2024కు ముందు అర్జెంటీ నుంచి భారత్ గ్యాస్ సరఫరా అసలే లేదు. మోడీ ప్రభుత్వం ఇంధన దిగుమతుల కోసం కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా చాలా దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. కానీ 2026లో తొలి 3 నెలల్లోనే అర్జెంటీనా నుంచి భారత్‌కు 50,000 టన్నుల ఎల్పీజీ దిగుమతులు వచ్చాయి. 2025లో ఈ దేశం నుంచి భారత్ 22,000 టన్నుల దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా LPG దిగుమతులు పెరిగాయి.

Read Also: Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..

ఇప్పటికే అర్జెంటీనాలోని బహియా బ్లాంకా ఓడరేవు నుంచి ఎల్పీజీ నౌకలు బయలుదేరాయి. మార్చ్ మొదటి వారంలో భారత్ చేరుకుంటాయి. అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలో చిట్టచివర ఉంది. ఇక్కడి నుంచి భారత్ రావాలంటే నౌకలు సుమారుగా 20,000 కిలోమీటర్లు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంపై ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అత్యంత పొడవైన నౌకా మార్గాల్లో ఒకటి. ఈ దూరం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవుతున్నా, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో మాట్లాడుతూ.. తమ వద్ద అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం గ్యాస్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్ ఇప్పటికే అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాము.

Exit mobile version