AUS vs IND: చివరకి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ‘ఫాలో ఆన్’ తప్పింనదుకు సంబరాలు (వీడియో)
- ‘ఫాలో ఆన్’ తప్పింనదుకు సంబరాలు చేసుకున్న
- టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Also Read: SBI Clerk Vacancy 2024: ఎస్బిఐలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Also Read
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మొదటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (84), జడేజా (77) కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ స్కోర్బోర్డును ముందుకు నడిపించారు. అయితే, చివరిలో టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ మరో వికెట్ పడకుండా విలువైన పరుగులు సాధించడంతో భారత్ను ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి గట్టెక్కించారు.
#TeamIndia have avoided the follow-on. AUSTRALIA WILL HAVE TO BAT AGAIN!#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM on Star Sports! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/DqW3C9DMJX
— Star Sports (@StarSportsIndia) December 17, 2024
Also Read: WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ఇక రూల్స్ ప్రకారం.. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయడంతో.. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయకపోతే ‘ఫాలో ఆన్’లో పడినట్లు అవుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఆహ్వానిస్తే, భారత్ మళ్లీ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. అయితే, భారత్ 246 పరుగులు దాటించి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. ఇక భారత్ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్కు ఆహ్వానించాలా, వద్దా అనేది ఆస్ట్రేలియా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఒకవేళ టీమిండియా ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్లో ముందుగా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత ఆస్ట్రేలియాదే. దీంతో భారత్కు మ్యాచ్ను డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!