మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 10,302 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 267 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,99,925 కు చేరుకుంది.
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,24,868 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,15,79,69,274 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,15,79,69,274 మందికి వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.