ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 392 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 12,509 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,46,950 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,36,41,175 కు పెరగగా.. కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4, 60, 265 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,10, 783 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,07,92,19,546 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.
COVID19 | India reports 10,929 new cases, 392 deaths and 12,509 recoveries in the last 24 hours; active caseload stands at 1,46,950
— ANI (@ANI) November 6, 2021
Total Vaccination : 1,07,92,19,546 pic.twitter.com/xixxN7SvLE