I.N.D.I.A. First Meeting: ‘ఇండియా’ తొలి వ్యూహాత్మక భేటీ.. కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I.N.D.I.A. First Meeting: ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి తొలి కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు.. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించింది.. సమావేశానికి 12 మంది నేతలు హాజరయ్యారు.. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కాలేకపోయారు తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ. కక్షపూరిత రాజకీయాలకు అధికార బీజేపీ పాల్పడుతోందని ఈ సమావేశం ఖండించింది.. ఇక, కులాల గణన చేపట్టాలని.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్మామ్య పక్షాలు చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు.. వివిధ టీవీ ఛానెల్స్ లో ఏఏ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో కూటమి పక్షాల నేతలు పాల్గొనరాదో.. ఆయా యాంకర్లతో కూడిన జాబితాను రూపొందించే బాధ్యతలను “ఇండియా” కూటమి కి చెందిన మీడియా “సబ్ గ్రూప్”కు అప్పగించింది సమన్వయ కమిటీ సమావేశం. మొత్తంగా ప్రతిపక్ష బ్లాక్ ఇండియా మొదటి వ్యూహాత్మక సమావేశంలో కుల గణన కోసం ముందుకు వచ్చారు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇండియా బ్లాక్ల ముంబై సమావేశంలో కుల గణనపై అభ్యంతరం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కానీ, నేటి సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ను ప్రదర్శించేందుకు కలిసికట్టుగా ఉన్న ఈ బృందం “సీట్ షేరింగ్ను నిర్ణయించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది” అని ఆయన వెల్లడించారు. కూటమి యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో పేరున్న 14 పార్టీలలో 12 మాత్రమే ఈరోజు హాజరయ్యారు. తృణమూల్ ఉనికిని కోల్పోయి, భారతదేశం ఇప్పుడు కుల గణన కోసం పిలుపునిచ్చి, ఆ తర్వాత పార్టీతో మాట్లాడాలని నిర్ణయించుకుందని తెలిసింది.. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు కుల గణన సమస్యను చేపట్టేందుకు అంగీకరించాయి.”
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!