I.N.D.I.A. First Meeting: ‘ఇండియా’ తొలి వ్యూహాత్మక భేటీ.. కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I.N.D.I.A. First Meeting: ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి తొలి కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు.. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించింది.. సమావేశానికి 12 మంది నేతలు హాజరయ్యారు.. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కాలేకపోయారు తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ. కక్షపూరిత రాజకీయాలకు అధికార బీజేపీ పాల్పడుతోందని ఈ సమావేశం ఖండించింది.. ఇక, కులాల గణన చేపట్టాలని.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్మామ్య పక్షాలు చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు.. వివిధ టీవీ ఛానెల్స్ లో ఏఏ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో కూటమి పక్షాల నేతలు పాల్గొనరాదో.. ఆయా యాంకర్లతో కూడిన జాబితాను రూపొందించే బాధ్యతలను “ఇండియా” కూటమి కి చెందిన మీడియా “సబ్ గ్రూప్”కు అప్పగించింది సమన్వయ కమిటీ సమావేశం. మొత్తంగా ప్రతిపక్ష బ్లాక్ ఇండియా మొదటి వ్యూహాత్మక సమావేశంలో కుల గణన కోసం ముందుకు వచ్చారు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇండియా బ్లాక్ల ముంబై సమావేశంలో కుల గణనపై అభ్యంతరం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కానీ, నేటి సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ను ప్రదర్శించేందుకు కలిసికట్టుగా ఉన్న ఈ బృందం “సీట్ షేరింగ్ను నిర్ణయించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది” అని ఆయన వెల్లడించారు. కూటమి యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో పేరున్న 14 పార్టీలలో 12 మాత్రమే ఈరోజు హాజరయ్యారు. తృణమూల్ ఉనికిని కోల్పోయి, భారతదేశం ఇప్పుడు కుల గణన కోసం పిలుపునిచ్చి, ఆ తర్వాత పార్టీతో మాట్లాడాలని నిర్ణయించుకుందని తెలిసింది.. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు కుల గణన సమస్యను చేపట్టేందుకు అంగీకరించాయి.”
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!