I.N.D.I.A. First Meeting: ‘ఇండియా’ తొలి వ్యూహాత్మక భేటీ.. కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I.N.D.I.A. First Meeting: ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి తొలి కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు.. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించింది.. సమావేశానికి 12 మంది నేతలు హాజరయ్యారు.. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కాలేకపోయారు తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ. కక్షపూరిత రాజకీయాలకు అధికార బీజేపీ పాల్పడుతోందని ఈ సమావేశం ఖండించింది.. ఇక, కులాల గణన చేపట్టాలని.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్మామ్య పక్షాలు చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు.. వివిధ టీవీ ఛానెల్స్ లో ఏఏ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో కూటమి పక్షాల నేతలు పాల్గొనరాదో.. ఆయా యాంకర్లతో కూడిన జాబితాను రూపొందించే బాధ్యతలను “ఇండియా” కూటమి కి చెందిన మీడియా “సబ్ గ్రూప్”కు అప్పగించింది సమన్వయ కమిటీ సమావేశం. మొత్తంగా ప్రతిపక్ష బ్లాక్ ఇండియా మొదటి వ్యూహాత్మక సమావేశంలో కుల గణన కోసం ముందుకు వచ్చారు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇండియా బ్లాక్ల ముంబై సమావేశంలో కుల గణనపై అభ్యంతరం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కానీ, నేటి సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ను ప్రదర్శించేందుకు కలిసికట్టుగా ఉన్న ఈ బృందం “సీట్ షేరింగ్ను నిర్ణయించే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది” అని ఆయన వెల్లడించారు. కూటమి యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో పేరున్న 14 పార్టీలలో 12 మాత్రమే ఈరోజు హాజరయ్యారు. తృణమూల్ ఉనికిని కోల్పోయి, భారతదేశం ఇప్పుడు కుల గణన కోసం పిలుపునిచ్చి, ఆ తర్వాత పార్టీతో మాట్లాడాలని నిర్ణయించుకుందని తెలిసింది.. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు కుల గణన సమస్యను చేపట్టేందుకు అంగీకరించాయి.”
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!