Indian Economy: ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనమే..!
- ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టిన భారత్..
- మరో మూడేళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్: నీతి ఆయోగ్ సీఈవో
Indian Economy: జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నేడు మనం $4,000 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాను ఉటంకిస్తూ.. నేడు భారతదేశం జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదని నీతి ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు.
Read Also: AlluArjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నాని హీరోయిన్.. ?
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
అయితే, అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. మనం మన ప్రణాళిక, ఆలోచనకు కట్టుబడి ఉన్నాం.. రెండున్నర నుంచి మూడు ఏళ్లలోనే మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని పేర్కొన్నారు. ఐఫోన్ కంపెనీ ఆపిల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సీఈవో సమాధానమిస్తూ, “టారిఫ్ రేట్లు ఎలా ఉంటాయో అనిశ్చితంగా ఉంటుంది.. కానీ పరిస్థితులు మారుతున్న తీరును బట్టి, మేము తయారీకి చౌకైన ప్రదేశంగా మారతామన్నారు. భారత్ తో పాటు మరెక్కడా ఆపిల్ ఐఫోన్లు తయారీ కేవలం అమెరికాలోనే ఉత్పత్రి అవుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ కూడా ఆస్తుల మానిటైజేషన్ రెండవ దశను రెడీ చేస్తున్నామని.. దాన్ని ఆగస్టులో ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also: Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!
ఇక, 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు. అంటే ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. వ్యవసాయం, హోటళ్ళు, రవాణా, నిర్మాణం లాంటి రంగాల బలమైన పని తీరు ఈ పెరుగుదలకు కారణం అన్నారు. ఈ సమాచారం కేర్ ఏజ్ రేటింగ్స్ అనే సంస్థ రిపోర్టులో పేర్కొనింది. నివేదిక ప్రకారం, పట్టణ, గ్రామాల్లో ప్రజల షాపింగ్ పెరిగిపోయింది. ఇది వినియోగాన్ని మరింత బలపరిచింది.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!