India Pak War: మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నాం.. భారత రాయబారి వినయ్ క్వాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే సముచిత ప్రతిస్పందన అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద నలుగురు పాక్కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 నిరాయుధ పౌరులు వారి భార్యలు, పిల్లల ఎదుటనే మతం పేరుతో హత్య చేయబడ్డారు. ఇదే ఉద్రిక్తతల బీజం అని క్వాత్ర వ్యాఖ్యానించారు. ఇది మామూలు ఘటన కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దారుణం అని ఆయన అన్నారు.
Read Also: Flights Fly Over Tirumala Temple: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..!
Also Read
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
పహల్గాం దాడికి ప్రతిగా భారత్ గత బుధవారం “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించి, తొమ్మిది ఉగ్ర శిక్షణా కేంద్రాలపై సునిశిత దాడులు నిర్వహించింది. భారత వైమానిక దళాలు ఉగ్ర స్థావరాలను అంచనాపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నాయని క్వాత్ర వివరించారు. దాడులు ఎవరిపై జరిగాయంటే, ప్రజలను హత్య చేసిన ఉగ్రవాదులపై మాత్రమే. వారి మద్దతుదారులపై మాత్రమే అని ఆయన తెలిపారు.
గత గురువారం రాత్రి పాకిస్తాన్ పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల్లోని భారత సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడి ప్రయత్నం చేసింది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి, మూడు పాక్ జెట్లను కూల్చివేసింది. దానికి ప్రతిగా భారత దళాలు పాక్ లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, మిసైల్ వ్యవస్థలపై కౌంటర్ దాడులు జరిపాయి.
Read Also: Rajnath Singh : రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు
పాకిస్తాన్ ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వచ్చింది. 9/11, 26/11 ముంబయి దాడుల నుంచే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే చేస్తోందని వినయ్ క్వాత్ర విమర్శించారు. అంతేకాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్దే అని స్పష్టం చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం భారత్లో భాగమే. ఇప్పుడు పాక్ ఆక్రమించిన ప్రాంతాన్ని తిరిగి పొందడమే ఏకైక సమస్య అని తెలిపారు. పాకిస్తాన్ గత 30 సంవత్సరాలుగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం అని క్వాత్ర అన్నారు. పాక్ తన పాత్రను వ్యూహంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ పరిణామాలు భారత్ ఉగ్రవాదంపై తేలికపాటి వైఖరి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా మద్దతు పెరుగుతున్నది.
తాజావార్తలు
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!