Ind vs SA 2nd Test: తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే భారత్ ఆలౌట్.. 314 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
- రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 26/0
- తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకు భారత్ ఆలౌట్
- తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్
- 314 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండు రోజుల ఆట పూర్తయింది. నేడు మ్యాచ్లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మూడవ రోజు కూడా, దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ తో అద్భుతం చేసింది. మార్కో జాన్సెన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా, హార్మర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 201 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read:Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
దీనికి ముందు, దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. టీమ్ఇండియాను ‘ఫాలోఆన్’ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు సౌతాఫ్రికా మొగ్గుచూపింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. రిషబ్ పంత్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో గెలవాలి. కోల్కతా టెస్టులో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది.
భారత తొలి ఇన్నింగ్స్లో, రెండవ రోజు చివరి సెషన్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ స్థిరంగా బ్యాటింగ్ చేయడంతో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత ఇన్నింగ్స్లో 6.1 ఓవర్లు మాత్రమే ఆడారు. మూడో రోజు ఆటలో యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. రాహుల్, యశస్వి మొదటి వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 22 పరుగుల వద్ద కేశవ్ మహారాజ్ చేతికి చిక్కాడు. యశస్వి 85 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్తో తన 13వ టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
యశస్వి జైస్వాల్ 58 పరుగుల వద్ద స్పిన్నర్ సైమన్ హార్మర్ చేతిలో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత హార్మర్ సాయి సుదర్శన్ (15 పరుగులు)ను అవుట్ చేశాడు. భారత జట్టు నాలుగో వికెట్ ధ్రువ్ జురెల్ (0 పరుగులు) రూపంలో పడిపోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ (7 పరుగులు) జాన్సెన్ చేతిలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్ షార్ట్ పిచ్ బంతులతో నితీష్ కుమార్ రెడ్డి (10 పరుగులు), రవీంద్ర జడేజా (6 పరుగులు)లను అవుట్ చేశాడు. జడేజా నిష్క్రమించే సమయానికి భారత్ 122/7తో ఉంది. అక్కడి నుంచి వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
Also Read:Thrikala: డిసెంబర్లో ‘త్రికాల’ రిలీజ్
సుందర్, కుల్దీప్ యాదవ్ ఎనిమిదో వికెట్కు 72 పరుగులు జోడించారు. సుందర్ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. సుందర్ 92 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 48 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ 134 బంతుల్లో 19 పరుగులు చేశాడు, మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జాన్సెన్ బుమ్రా (5 పరుగులు)ను అవుట్ చేసి భారత ఇన్నింగ్స్ను ముగించాడు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!