India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు అత్యంత స్వల్ప ఫార్మాట్లో విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా వరుసగా రెండు సిరీస్లలో చారిత్రక ఓటములను చవిచూసింది. ఐర్లాండ్లో రెండు, ఇంగ్లండ్లో నాలుగు టీ20 మ్యాచ్లలో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జులై 23 గురువారం నుంచి జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా భారత జట్టును హెచ్చరించారు. తమ జట్టును తక్కువ అంచనా వేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని వ్యాఖ్యానించారు. భారత జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని, ఈ సిరీస్ ఏకపక్షంగా సాగదని, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని రజా ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్లపై సాధించిన విజయాలు తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని చెప్పారు. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్లో తన ప్రతిభను చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ పర్యటనకు సంజూ శాంసన్ దూరం కాగా, ఐపీఎల్ 2026లో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్కు జట్టులో చోటు లభించింది. సెలెక్టర్లు తొలిసారిగా వేగవంతమైన బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మలతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు.
భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తదితరులు ఉన్నారు. మరోవైపు సికందర్ రజా నేతృత్వంలో బ్రయాన్ బెన్నెట్, రిచర్డ్ నగారావా, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి బలమైన ఆటగాళ్లతో జింబాబ్వే సిద్ధమైంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!