IND vs SL: తిరువనంతపురం వేదికగా జరిగిన నాల్గో మహిళల టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల ధనాధన్ బ్యాటింగ్తో భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంతో శ్రీలంకపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.…