NTV Telugu Site icon

IND vs SL 3rd ODI: బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు! ఒక్కడే పేసర్

Ind Vs Sl 3rd Odi

Ind Vs Sl 3rd Odi

KL Rahul Out From IND vs SL 3rd ODI: కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కీలక వన్డే కోసం లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అఖిల దనంజయ స్థానంలో మహీశ తీక్షణ జట్టులోకి వచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ రెండు మార్పులు చేశాడు. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ల స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ ఆడనున్నారు.

కీలక వన్డే కోసం భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. మొహమ్మద్ సిరాజ్ ఒక్కడే పేసర్. కొలంబో పూర్తిగా స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకున్నాడు. అవసరం అనుకుంటే శివమ్ దూబేతో బౌలింగ్ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్‌ సేన చూస్తోంది.

Also Read: Vinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమాన్ గిల్‌, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్‌, రియాన్ పరాగ్‌, శివమ్ దూబే, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాథుమ్‌ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, అసలంక (కెప్టెన్‌), జనిత్‌ లియనాగె, కమిందు మెండిస్‌, వెల్లలాగే, తీక్షణ, వాండర్సే, అసిత ఫెర్నాండో.