Ind vs SA: నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని విసిరింది.
Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో)
ఇక భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్ నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి ‘రిటైర్డ్ అవుట్’గా బయటకు వచ్చాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 24 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ.. 19 బంతుల్లో 45 పరుగులు చేసి స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్టైల్లో 16 బంతుల్లో 30 పరుగులు చేసి అలరించాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చూపించారు.
YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా మరోసారి అసలైన విధ్వంసం ఏంటో రుచి చూపించాడు. కేవలం 10 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్ కు హైలైట్గా నిలిచాడు. మరోవైపు అక్షర్ పటేల్ 23 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్కు తోడ్పడ్డాడు. అలాగే రింకు సింగ్ 16 పరుగులతో సహకారం అందించాడు. సౌతాఫ్రికా బౌలింగ్లో జాన్సెన్, బోష్, మఫాకా తలో వికెట్ మాత్రమే తీశారు. మొత్తంగా టీమిండియా బ్యాటింగ్ ముందు ప్రోటీస్ బౌలింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది.
