KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Says Sanju Samson Played Really Well Today: ఆటను ఆస్వాదించండి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండని తాను యువ క్రికెటర్లకు చెప్పానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ చెప్పాడు. ప్రస్తుత జట్టులో కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారన్నాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రాహుల్ సేన 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం లోకేష్ రాహుల్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టా. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలవడం ఆనందంగా ఉంది. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆడాను. యువ క్రికెటర్లకు ఒకేటే చెపుతున్నా.. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు. వన్డే సిరీస్ సందర్భంగా జట్టులో వారి పాత్రను గుర్తు చేశాను’ అని తెలిపాడు.
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
Also Read: Coal Mine Accident: బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
‘ప్రస్తుత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. కానీ జాతీయ జట్టుకు వచ్చేసరికి.. కొన్ని కారణాల వల్ల టాప్ ఆర్డర్లో ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదు. ఈరోజు తన సత్తా ఏంటో చూపించాడు. మంచి షాట్లు ఆడుతూ పరుగులు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సంజూ నుంచి ఆశించాం’ అని లోకేష్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108; 114 బంతుల్లో 6×4, 3×6) సెంచరీ బాదాడు. ఆపై 97 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!