KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Says Sanju Samson Played Really Well Today: ఆటను ఆస్వాదించండి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండని తాను యువ క్రికెటర్లకు చెప్పానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ చెప్పాడు. ప్రస్తుత జట్టులో కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారన్నాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రాహుల్ సేన 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం లోకేష్ రాహుల్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టా. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలవడం ఆనందంగా ఉంది. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆడాను. యువ క్రికెటర్లకు ఒకేటే చెపుతున్నా.. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు. వన్డే సిరీస్ సందర్భంగా జట్టులో వారి పాత్రను గుర్తు చేశాను’ అని తెలిపాడు.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
Also Read: Coal Mine Accident: బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
‘ప్రస్తుత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. కానీ జాతీయ జట్టుకు వచ్చేసరికి.. కొన్ని కారణాల వల్ల టాప్ ఆర్డర్లో ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదు. ఈరోజు తన సత్తా ఏంటో చూపించాడు. మంచి షాట్లు ఆడుతూ పరుగులు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సంజూ నుంచి ఆశించాం’ అని లోకేష్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108; 114 బంతుల్లో 6×4, 3×6) సెంచరీ బాదాడు. ఆపై 97 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!