IND vs PAK Final: పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు!
- పాకిస్థాన్తో భారత్ ఫైనల్ మ్యాచ్
- హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియా
- వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని ఉవ్విళ్లూరుతోన్న పాక్
- ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్తో భారత్ ఫైనల్లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
ఫైనల్కు ముందు శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ శివమ్ దూబేలకు టీమిండియా మాజేన్మెంట్ రెస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్తో ఫైనల్లో ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్కే పరిమితం కానున్నారు. విన్నింగ్ కాంబినేషన్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించనున్నాడు. శ్రీలంక మ్యాచ్లో కండరాలు పట్టేసిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. గాయపడిన వారిలో ఎవరైనా ఆడకుంటే అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్, జితేష్ శర్మలు సిద్ధంగా ఉన్నారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. శుభ్మన్ గిల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో అయినా 360 డిగ్రీస్ చూపించాల్సి ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో రాణిస్తున్న శివమ్ దూబే బ్యాటింగ్లో సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలు రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ తీయాల్సి ఉంది.
Also Read: IND vs PAK Final: పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!