IND vs PAK Final: పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు!
- పాకిస్థాన్తో భారత్ ఫైనల్ మ్యాచ్
- హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియా
- వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని ఉవ్విళ్లూరుతోన్న పాక్
- ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్తో భారత్ ఫైనల్లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
ఫైనల్కు ముందు శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ శివమ్ దూబేలకు టీమిండియా మాజేన్మెంట్ రెస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్తో ఫైనల్లో ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్కే పరిమితం కానున్నారు. విన్నింగ్ కాంబినేషన్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించనున్నాడు. శ్రీలంక మ్యాచ్లో కండరాలు పట్టేసిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. గాయపడిన వారిలో ఎవరైనా ఆడకుంటే అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్, జితేష్ శర్మలు సిద్ధంగా ఉన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. శుభ్మన్ గిల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో అయినా 360 డిగ్రీస్ చూపించాల్సి ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో రాణిస్తున్న శివమ్ దూబే బ్యాటింగ్లో సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలు రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ తీయాల్సి ఉంది.
Also Read: IND vs PAK Final: పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!