IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
- భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్
- ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి
- 1984లో మొదలైన ఆసియా కప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. 2025 ఎడిషన్లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
1984లో ఆసియా కప్ మొదలైంది. అప్పట్లో మూడు జట్లతో మొదలైన ఆసియా కప్.. ఇప్పుడు 8 జట్లకు చేరింది. భారత్ 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్ను గెలుచుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఇన్నేళ్లలో టాప్ టీమ్లు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడలేదు. ఆ అవకాశం ఇపుడు వచ్చింది. భారత్ 10 సార్లు ఫైనల్కు చేరినా ఒక్కసారి కూడా పాకిస్థాన్ను ఫైనల్లో ఢీకొట్టలేదు. సెప్టెంబర్ 28న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Also Read: Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఇక ఆసియా కప్లో ఇప్పటివరకూ ఒకే ఎడిషన్లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు మ్యాచ్లు ఆడలేదు. నాలుగు సందర్భాల్లో రెండుసార్లు ఢీకొట్టాయి. ఈ ఎడిషన్లో ముచ్చటగా మూడోసారి తలపనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్లలో పాక్పై భారత్ విజయం సాధించింది. ఫైనల్లోనూ పాక్ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా టైటిల్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి ఆసియా కప్ 2025 మన దగ్గరే జరగాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్లో జరగగా.. భారత్ మ్యాచ్లు మాత్రం యూఏఈల జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీ కోసం పాక్లు భారత్ రాకుంటే.. తాము ఆసియా కప్కు ఇండియా రామని పీసీబీ చెప్పిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!