IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
- భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్
- ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి
- 1984లో మొదలైన ఆసియా కప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. 2025 ఎడిషన్లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
1984లో ఆసియా కప్ మొదలైంది. అప్పట్లో మూడు జట్లతో మొదలైన ఆసియా కప్.. ఇప్పుడు 8 జట్లకు చేరింది. భారత్ 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్ను గెలుచుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఇన్నేళ్లలో టాప్ టీమ్లు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడలేదు. ఆ అవకాశం ఇపుడు వచ్చింది. భారత్ 10 సార్లు ఫైనల్కు చేరినా ఒక్కసారి కూడా పాకిస్థాన్ను ఫైనల్లో ఢీకొట్టలేదు. సెప్టెంబర్ 28న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఇక ఆసియా కప్లో ఇప్పటివరకూ ఒకే ఎడిషన్లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు మ్యాచ్లు ఆడలేదు. నాలుగు సందర్భాల్లో రెండుసార్లు ఢీకొట్టాయి. ఈ ఎడిషన్లో ముచ్చటగా మూడోసారి తలపనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్లలో పాక్పై భారత్ విజయం సాధించింది. ఫైనల్లోనూ పాక్ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా టైటిల్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి ఆసియా కప్ 2025 మన దగ్గరే జరగాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్లో జరగగా.. భారత్ మ్యాచ్లు మాత్రం యూఏఈల జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీ కోసం పాక్లు భారత్ రాకుంటే.. తాము ఆసియా కప్కు ఇండియా రామని పీసీబీ చెప్పిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!