IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
- భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్
- ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి
- 1984లో మొదలైన ఆసియా కప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. 2025 ఎడిషన్లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
1984లో ఆసియా కప్ మొదలైంది. అప్పట్లో మూడు జట్లతో మొదలైన ఆసియా కప్.. ఇప్పుడు 8 జట్లకు చేరింది. భారత్ 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్ను గెలుచుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఇన్నేళ్లలో టాప్ టీమ్లు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడలేదు. ఆ అవకాశం ఇపుడు వచ్చింది. భారత్ 10 సార్లు ఫైనల్కు చేరినా ఒక్కసారి కూడా పాకిస్థాన్ను ఫైనల్లో ఢీకొట్టలేదు. సెప్టెంబర్ 28న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
Also Read: Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఇక ఆసియా కప్లో ఇప్పటివరకూ ఒకే ఎడిషన్లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు మ్యాచ్లు ఆడలేదు. నాలుగు సందర్భాల్లో రెండుసార్లు ఢీకొట్టాయి. ఈ ఎడిషన్లో ముచ్చటగా మూడోసారి తలపనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్లలో పాక్పై భారత్ విజయం సాధించింది. ఫైనల్లోనూ పాక్ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా టైటిల్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి ఆసియా కప్ 2025 మన దగ్గరే జరగాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్లో జరగగా.. భారత్ మ్యాచ్లు మాత్రం యూఏఈల జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీ కోసం పాక్లు భారత్ రాకుంటే.. తాము ఆసియా కప్కు ఇండియా రామని పీసీబీ చెప్పిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!