IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్ ఆడలేం.. 200 ప్లస్ లీడ్ ఉంటేనే గెలుపై అవకాశాలు!
- 200 ప్లస్ లీడ్ ఉంటేనే అవకాశాలు
- తొలిరోజు నుంచే స్పిన్నర్ల ప్రభావం
- నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అత్యంత కఠినం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్ను మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.
పూణే పిచ్పై తొలిరోజు నుంచే స్పిన్నర్లు ప్రభావం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అత్యంత కఠినం అం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ్సరం లేదు. లక్ష్య ఛేదనలో 150-170 పరుగులు చేయడం కూడా కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకే టాస్ గెలిచిన కివీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బంతి గింగిరాలు తిరుగుతున్నా.. న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. ఇక భారత్ రేసులో నిలవాలంటే.. రెండో రోజు ఆటతో పాటు మూడో రోజు కూడా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్లో కనీసం 450కి పైగా పరుగులు చేసి.. 200 ప్లస్ లీడ్ ఉంటే మ్యాచ్పై పట్టు సాధించవచ్చు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
Also Read: Yuvraj Singh: మీ ఆరెంజ్లను చెక్ చేసుకోండి.. యువరాజ్ సింగ్ యాడ్పై విమర్శలు!
ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (6), శుబ్మన్ గిల్ (10) ఉన్నారు. గిల్ కాస్త వేగంగా ఆడినా.. యశస్వి తన దూకుడుకు భిన్నంగా ఆడాడు. ఈ ఇద్దరు మంచి భాగస్వామ్యం నిర్మించాల్సి ఉంది. రెండోరోజు తొలి సెషన్ అత్యంత కీలకం. పేస్కు కాస్త సహకారం లభించే అవకాశం ఉంది. ఈక్రమంలో వీరు కాస్త ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. గత టెస్టులో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలపై భారీ ఆశలు ఉన్నాయి. పూణేలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు (254)ను ఇక్కడే సాధించాడు. సర్ఫరాజ్, రిషబ్ రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయడం పక్కా.
తాజావార్తలు
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..