పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్ను మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్లో భారత్ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు…