NTV Telugu Site icon

Virat Kohli: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. మిగతా 3 టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ ఔట్!

Virat Kohli Test

Virat Kohli Test

Virat Kohli likely to out from Last 3 Tests vs England: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే మూడు మరియు నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లకు దూరం అయిన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా.. తాజా సమాచారం ప్రకారం 3,4 టెస్టులకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది. విరాట్ ఐదో టెస్ట్ మ్యాచ్‌ ఆడడం కూడా సందేహమేనట.

తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై విరాట్ కోహ్లీ.. బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. నేడు బీసీసీఐ సెలెక్టర్లు ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. విరాట్ వల్లే జట్టు ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం. విరాట్ ఆడేది లేనిది నేడు తేలిపోనుంది. ఇక తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలోనే విరాట్‌ ఆటకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.

Also Read: SA20 2024: హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్‌ జెయింట్స్‌!

ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. బుమ్రా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.