KS Bharat: రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు.. భరత్ రాణిస్తేనే భవిష్యత్తులో అవకాశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar on KS Bharat ahead of IND vs ENG 3rd Test: హైదరాబాద్, విశాఖలో ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పెద్దగా రాణించలేదు. హైదరాబాద్ టెస్టులో (41, 28) కాస్త పోరాట పటిమ చూపించిన భరత్.. రెండో టెస్టులో (17, 6) విఫలం అయ్యాడు. భరత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరానికి గురి చేస్తోంది. వికెట్ల వెనకాల బాగానే రాణిస్తున్నా.. బ్యాటింగ్తో నిరాశపరుస్తున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఎవరూ లేకపోవడంతో.. భరత్ను టీమ్ మేనేజ్మెంట్ కొనసాగిస్తోంది. చివరి అవకాశంగా మూడో టెస్టులో ఛాన్స్ ఇవ్వనుంది.
ఇషాన్ కిషన్ రంజీల్లో బాగా ఆడి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2024లో పంత్ కొన్ని మ్యాచ్లు ఆడతాడని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. ఈ సమయంలో కేఎస్ భరత్ రాణిస్తేనే.. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. తదుపరి మ్యాచుల్లో భరత్ రాణించకపోతే.. ఇషాన్ వైపు మొగ్గు చూపడం ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు.
Also Read
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Also Read: U19 World Cup 2024: సెమీస్లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!
‘తొలి సిరీస్లో ఆడుతున్నాడని కేఎస్ భరత్ భావిస్తున్నాడేమో. ఇప్పటికే అతడు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లో ఆడాడు. రిషబ్ పంత్ లేని సమయంలో జట్టులోకి వచ్చాడు. పెద్దగా రాణించని అతడిని కొనసాగించడంపై మేనేజ్మెంట్ ఇప్పటికే ఆలోచన చేసుంటుంది. భరత్ తదుపరి మ్యాచుల్లో రాణించకపోతే.. ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపడం ఉత్తమం. ఆటగాళ్ల సామర్థ్యాలపై సెలక్టర్లకు నమ్మకం ఉండొచ్చు. అయితే వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గా ఉంటేనే జట్టులోకి తీసుకోవాలి. ఇప్పుడు పంత్ కోలుకుంటున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో భరత్ బాగా కీపింగ్ చేసినా బ్యాటింగ్ చేయలేకపోతే.. అతడిని పక్కన పెట్టేయాల్సిందే. క్రికెట్లో కీపర్ బ్యాటింగ్లోనూ రాణించాలి. వచ్చే 3-5 ఏళ్లు పంత్ తప్పకుండా సక్సెస్ అవుతాడు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!