U19 World Cup 2024: సెమీస్లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!
Pakistan U19 Players cried after defeted by Australia: గురువారం విల్మోర్ పార్క్లో ఉత్కంఠభరితంగా సాగిన అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఒక్క వికెట్ తేడాతో పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించింది. టామ్ స్ట్రేకర్ (6/24), డిక్సన్ (50; 75 బంతుల్లో 5×4) ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఆసీస్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెమీఫైనల్లో పరాజయం ఎదురవ్వడంతో పాక్ ఆటగాళ్లు మైదానంలో కన్నీటి పర్యంతమయ్యారు.
సెమీ ఫైనల్లో విజయానికి చేరువగా వచ్చి.. పరాజయం పాలవ్వడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో ఏడ్చేశారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని పాక్ ప్లేయర్స్ ఆపుకోలేకపోయారు. విన్నింగ్ షాట్ అనంతరం పాక్ ప్లేయర్స్ అందరూ మైదానంలో అలానే కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. విన్నింగ్ షాట్ను ఆపేందుకు డైవ్ చేసి విఫలమైన పాక్ ఆటగాడు ఉబైద్ షా.. నేలపై అలానే పడుకున్నాడు. ప్రస్తుతం పాక్ ఆటగాళ్ల భావోద్వేగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
Also Read: Telengana Tigers: తెలంగాణ కెప్టెన్గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్!
180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు అన్నివిధాల ప్రయత్నించారు. చివరకు విజయం వైపు అడుగులు వేశారు. అయితే దురదృష్టవశాత్తు చివరి వికెట్ తీయలేక ఓటమిపాలయ్యారు. చివరి ఆటగాడు కల్లమ్ వైడ్లర్ (2)తో కలిసి రఫ్ మాక్ మిలన్ (19) 17 పరుగులు చేసి ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. అజాన్ అవైస్ (52), అరఫత్ మిన్హాస్ (52) హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్ టామ్ స్ట్రాకర్ (6/24) ఆరు వికెట్లతో చెలరేగాడు. చేధనలో ఆసీస్ 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. హారీ డిక్సన్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలివర్ పీక్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రాజా నాలుగు వికెట్లు తీశాడు. ఆదివారం జరగనున్న తుది పోరులో భారత్తో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!