IND vs AUS: 21ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యశస్వి జైస్వాల్ – కేఎల్ రాహుల్ జోడి
- 21ఏళ్ల తర్వాత
- రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పిన
- యశస్వి జైస్వాల్ - కేఎల్ రాహుల్ జోడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS KL Rahul and Yashasvi Jaiswal Partnership: ఒక రోజు లేదా ఒక సెషన్ టెస్ట్ మ్యాచ్లో పరిస్థితి ఎలా మారుతుందనే దానికి తాజా ఉదాహరణ పెర్త్ టెస్ట్ ఉదాహరణగా నిలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ తొలిరోజే ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో బ్యాట్స్మెన్స్ కష్టాల్లో పడ్డారు. భారత్, ఆస్ట్రేలియాలు కలిసి 17 వికెట్లు కోల్పోయినప్పటికీ రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయి బ్యాటింగ్ సులువైంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పెర్త్ టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ను 104 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా 46 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీని తర్వాత, టీమిండియా రెండో ఇన్నింగ్స్లో మెరుగైన ఆరంభాన్ని పొందగలదా అని అందరి దృష్టి ఓపెనింగ్ జోడిపై పడింది. తొలి ఇన్నింగ్స్లో ఇది జరగలేదు. ఎందుకంటే, యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే ఈసారి మాత్రం భారీ స్కోరుకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అవసరం కావడంతో బ్యాట్స్మెన్స్ ఇద్దరూ నిరాశపరచలేదు.
Also Read: AUS vs IND: ఐయామ్ ఇంప్రెస్డ్.. బుమ్రాపై ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు!
Also Read
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
ఇకపోతే, ఆప్టస్ స్టేడియంలోని పిచ్ రెండో రోజు బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. అయితే, ఆస్ట్రేలియా అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ను అధిగమించడం అంత సులభం కాదు. కొత్త బంతి ముందు ఓపిక అవసరం. అయితే, జైస్వాల్-రాహుల్ జోడి ఓపికగా ఆడి వారి కాన్ఫిడెన్సును పూర్తిగా దెబ్బ తీశారు. వీరిద్దరూ ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా ఓపికగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా వికెట్ల కోసం తహతహలాడింది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన మొదటి అర్ధ సెంచరీని కూడా సాధించాడు. దీంతో పాటు రాహుల్తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశాడు. కొంత సమయం తరువాత, రాహుల్ కూడా తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో వివాదాస్పదంగా అవుట్ అయినా అదే బలమైన శైలిని ఇక్కడ కూడా కొనసాగించాడు.
Also Read: Devendra Fadnavis: “అన్నంత పనిచేసిన ఫడ్నవీస్”.. 2019లో చేసిన కామెంట్స్ వైరల్..
ఈ సమయంలో భారత్ 21 ఏళ్ల నిరీక్షణ కూడా ముగిసింది. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత ఓపెనింగ్ జోడీ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అంతకుముందు 2003 – 2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్, సిడ్నీ టెస్ట్లలో సెంచరీ భాగస్వామ్యాలు చేశారు. మెల్బోర్న్లో 141 పరుగులు, సిడ్నీలో 123 పరుగుల భాగస్వామ్యం ఉంది. దీని తరువాత భారతదేశం నుండి అతిపెద్ద భాగస్వామ్యం 71 పరుగులు మాత్రమే. ఇది గత ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మధ్య జరిగింది.
తాజావార్తలు
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..